10 June, 2026 | 6:08 PM

Breaking News

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •   పరిశుభ్రంగా ఉన్న గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయి: ఎమ్మెల్యే కోరం   •   బొల్లారంలో గ్రామసభ   •   లంబాడితండాలో పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాo   •   మహిళల రక్షణకు ప్రాధాన్యత   •   అక్రిడిటేషన్ కార్డుల పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

స్వచ్ఛ బోడుప్పల్‌కు సహకరించాలి

14-10-2025 12:00 AM

మేడిపల్లి, అక్టోబర్ 13 (విజయక్రాంతి): బోడుప్పల్  నగర పాలక సంస్థలో పలు చెత్త వేసే ప్రాంతములను గుర్తించి తక్షణమే చెత్త ను శుభ్రం చేయాలని, ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్  కమీషనర్ శైలజ పారిశుధ్య అధికారులను, సిబ్బం దిని ఆదేశించడం జరిగినది.ఇట్టి ఆదేశములతో సోమవారం 7వ డివిజన్  శివాలయం రోడ్డులో ప్రత్యేక పారి శుధ్య కార్యక్రమంలో భాగముగా చెత్తను తొలగించారు.

ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ .. ఎవరైనా బహిరంగ ప్రదేశములలో చెత్త వేస్తే భారీ జరిమానా తో పాటు క్రిమినల్ చర్యలు మున్సిపల్ చట్టము ను అనుసరించి విధించబడునని హెచ్చరించారు. ప్రజలందరూ చెత్త ను స్వచ్ఛ వాహనములకు అందచేసి స్వచ్ఛ బోడుప్పల్ కు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమములో సానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, సంగీత, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.