calender_icon.png 2 June, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం

30-05-2025 12:54:20 AM

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో చామల

చేర్యాల,మే 29: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో కొమ్మూరు ప్రతాపరెడ్డి తో కలిసి బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే సగానికి పైగా హామీలను అమలు చేశామని, మిగతావి ఆరు నెలల లోపు పూర్తిగా అమలు చేస్తామని.

ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, హామీల అమలుకు కొంత సమయం పట్టినప్పటికీ హామీలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. హామీల అమలులో కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ, వాటిని పరిష్కరిస్తున్నామన్నారు  ఏడాదిన్నర పాలనలో ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఎక్కడో ఒకచోట  కొత్త కొత్త పథకాలను ప్రారంభిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రాజీవ్ యువ వికాసం, ఇంటిగ్రేటెడ్ స్కూల్లు లాంటి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ప్రజా పాలనలో ప్రజలందరికి ప్రజా పాలన అందుతుందన్నారు . కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తగ్గించుకోవడం కోసం, నిధుల సమీకరణకు అహర్నిశల  కృషి చేస్తున్నాడన్నారు.

 కురుమ భవనానికి శంకుస్థాపన

 చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన భవనానికి ప్రభుత్వ విప్ప్ ఐలయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి,నాయకులు కొమ్ము రవి, పురుమ ఆగం రెడ్డి, దాసరి శ్రీకాంత్, అంది అశోక్, మహాదేవుని శ్రీనివాస్, చెరుకు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.