calender_icon.png 1 June, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగేష్ సేవలు మరువలేనివి

30-05-2025 12:53:59 AM

 చండూరు, ( గట్టుప్పల) మే 29( విజయ క్రాంతి):  నగేష్ ప్రజలకు చేసిన సేవలు మరువలేనివి అని సిపిఎం రాష్ర్ట కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం కకునూరి నగేష్ ఉదయం తెల్లవారుజామున మరణించారు. ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల కోసం, కర్షకుల కోసం, ప్రజల కోసం నిరంతరం పోరాడే వారని ఆయన అన్నారు.  సిపిఎం పార్టీలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులుగా, సిఐటియు మండల కన్వీనర్ గా,సిఐటియు జిల్లా కమిటీ సభ్యులుగా పనిచేశారని ఆయన అన్నారు.

ఆయన మరణం సిపిఎం పార్టీకి తీరని లోటని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక కార్యకర్త కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నగేష్ కుటుంబానికి సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారు.అనంతరం వారి కుటుంబానికి సిపిఎం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా, సిపిఎం పార్టీకి కట్టుబడి ఉండేవారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, ప్రజానాట్యమండలి రాష్ర్ట కార్యదర్శి కట్ట నరసింహ, మాజీ సర్పం మల్గే శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ గొరిగే సత్తయ్యసిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, చాపల మారయ్య, సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం సీనియర్ నాయకులు మొగుదాల వెంకటేశం, కర్నాటి సుధాకర్, పగిళ్ల బిక్షం,ఎండి రబ్బాని, కర్నాటి వెంకటేశం, ఏర్పుల సైదులు, రాచమల్ల వెంకటరెడ్డి,పెద్దగాని నరసింహ, వల్లూరి శ్రీశైలం, అచ్చిన శ్రీనివాస్,బుచ్చిరెడ్డి, అచ్చిన బీరప్ప, సైదులు, కే. శంకర్, కే.శ్రీను, బి.యాదయ్య, ముత్యాలు, పెద్దులు, రాములు, శ్రీశైలం, కృష్ణయ్య, శ్రీకాంత్, రాములు, వెంకటేశం, యాదయ్య, యాదిరెడ్డి, గుంటోజు విశ్వనాథం, అబ్బయ్య, శంకరప్ప, వీరమల్ల బిక్షం తదితరులు పాల్గొన్నారు.