28-06-2025 12:33:03 AM
ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ, జూన్ ౨౭ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా కోదాడ నియోజకవర్గంలో అమలు చేస్తామని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గుత్తేదారుల పనుల్లో నాణ్యత లోపిస్తే సహించనున్నారు.
18 నెలల కాలంలో కోదాడ నియోజకవర్గానికి సుమారు రూ. 2000 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేయించానన్నారు. గ్రామీణ అభివృద్ధి రోడ్లు వ్యవసాయం నీటిపారుదల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తానన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధులు విలేకరులే అని కితాబిచ్చారు.
విలేకరుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు తమకు ఏళ్ల తరబడి ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీలు ఇచ్చారే తప్ప అమలు చేయలేదని ఎమ్మెల్యే దృష్టికి తేగా తప్పకుండా విలేకరులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయిస్తానన్నారు సంక్షేమ పథకాల్లో అర్హులైన విలేకరులకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. రాబోయే రోజుల్లో కోదాడ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించి రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతామన్నారు.