13 July, 2026 | 9:58 PM

Breaking News

బాలకార్మికుడికి విముక్తి… బడిలో చేర్పించిన సర్పంచ్   •   కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం   •   తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •  

మంత్రి కొండా మాట్లాడింది నిజమే

17-05-2025 01:00 AM

మంత్రుల అవినీతిపై విచారణ జరపాలి: కేటీఆర్

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): మంత్రుల అవినీతి విషయంలో మంత్రి కొండా సురేఖ పూర్తి నిజాలే మాట్లాడారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కమీషన్లు లేకుండా మంత్రులు సంతకం చేయడం లేదని ఆమె ఉన్న విషయమే చెప్పారని కేటీఆర్ ట్వీట్ చేశారు. నిజాలు చెప్పినందుకు కొండా సురేఖను తాను అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం కమీషన్ల సర్కార్‌గా మారిపోయిందని, ఇది చాలా బాధాకరమన్నారు.

30 శాతం కమీషన్ లేకుండా మంత్రులు సంతకం చేసే పరిస్థితి లేదన్నారు. సెక్రటేరియేట్‌లో కాంట్రాక్టర్లు కమీషన్ వ్యవహారంపై ధర్నా చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. మంత్రుల అవినీతిపై మాట్లాడిన కొండా సురేఖ వారెవరో బయటపెట్టాలన్నారు. మంత్రుల అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ విచారణకు ఆదేశిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు.