13-06-2025 12:00:00 AM
ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో రాష్ట్రంలో మరో అధికారిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన వార్త కలకలం రేపుతున్నది. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఉన్న ఆయన అంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టడం ఆశ్చర్యమే. ఏసీబీ అధికారుల కృషి అభినందనీయం. ఇలాంటి తనిఖీలు ముమ్మరం చేసినప్పుడే ప్రభుత్వ అధికార వర్గాల్లో భయం అన్నది నెలకొంటుంది. లేకపోతే, మరింత ఇష్టారాజ్యంగా వారు అవినీతికి పాల్పడుతూనే ఉంటారు.
సహర్ష, ఓల్డ్ ఆల్వాల్, సికిందరాబాద్