calender_icon.png 27 December, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడో

27-12-2025 12:00:00 AM

రేవల్లి, డిసెంబర్ 26: మండల కేంద్రం నుంచి కేశంపేట మీదుగా వనపర్తికి వెళ్లే ప్రధాన రహదారి ప్రస్తుతం నరకప్రాయంగా మారింది. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే వాహనదారులు గజగజ వణికిపోతున్నారు. రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలు మృత్యుపాశాలుగా మారి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఉన్నత అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.