calender_icon.png 25 June, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలన గాడిలో పడేనా...?

16-06-2025 01:47:30 AM

- జిల్లాలో కొందరు అధికారుల ఇష్టారాజ్యం 

- కార్యాలయాలకు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్న వైనం 

- పట్టణాలలో అక్రమ నిర్మాణాల జోరు 

- అసైన్డ్ భూములు అన్యాక్రాంతం 

- కలెక్టర్ మను చౌదరికి సవాలు 

మేడ్చల్, జూన్ 15(విజయ క్రాంతి): కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన మను చౌదరి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ముందు గా జిల్లాలో గాడి తప్పిన పాలనను చక్క పెట్టాల్సిన అవసరం ఉంది. గత కొంతకాలంగా కొందరు కిందిస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. పై అధికారుల అజమాయిషి కొరవడినందునే కిందిస్థాయి అధికా రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పై అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు, ఆకస్మిక తనిఖీలు లేకపో వడంతో తమను అడిగే వారు లేరనే భావన ఏర్పడింది.

జిల్లాలో కొందరు అధికారులు కార్యాలయాలకు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. కొందరైతే రోజుల తరబడి కార్యాలయాలకు రావడం లేదు. పై అధికారులు వివిధ శాఖల మీద సమీక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల పురోగతిపై కూడా పరిశీ లన మొక్కుబడిగా జరిగింది. జిల్లాకు మంత్రి పదవి లేకపోవడమే గాక ఎమ్మెల్యేలందరూ విపక్ష పార్టీకి చెందినవారు కావడం అధికారులకు కలిసి వచ్చింది. మేడ్చల్ జిల్లా హైదరాబాదు నగర్ శివారు ప్రాంతం. అయినప్పటికీ అధికారులు కార్యాలయాలకు సరి గా రావడం లేదు. కలెక్టర్ మను చౌదరి కొ న్ని కీలకమైన శాఖల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 

జోరుగా అక్రమ నిర్మాణాలు 

మేడ్చల్ జిల్లా మొత్తం పురపాలక శాఖ పరిధిలోకి వచ్చింది. జిహెచ్‌ఎంసి తోపాటు నాలుగు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో అక్రమ నిర్మాణాలు జో రుగా సాగుతున్నాయి. అక్రమ నిర్మాణాల విషయమై మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎలాం టి అనుమతి లేకుండా పెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. హెచ్ ఎండి ఏ నుంచి అనుమతి ఇచ్చారని ఊరుకుం టున్నారు. వాస్తవానికి హెచ్‌ఎండిఏ అనుమతినివ్వడం లేదు. మామూళ్ళు అందడంతో మున్సిపల్ సిబ్బంది అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం లేదు. 

నిద్రావస్తలో ఇరిగేషన్ అధికారులు 

జిల్లాలో చెరువుల కింద ఆయకట్టు లేదు. కానీ విలువైన చెరువుల భూములు మాయమవుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులు కాపాడ డానికి హైడ్రావంటి వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ చెరువులు కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారు. మేడ్చల్ పెద్ద చెరువు బఫర్ జోన్‌లో జిల్లాలు నిర్మిస్తున్నారు. గుండ్ల పోచంపల్లిలో రెండు చెరువుల్లో శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయి. 

అసైన్డ్ భూముల్లో ఇటుక బట్టీలు 

జిల్లాలో అసైన్డ్ భూములు కమర్షియల్ గా మారుతున్నాయి. పలుచోట్ల అసైన్డ్ భూముల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేశారు. రెవిన్యూ అధికారులకు తెలిసిన పట్టించుకోవడం లేదు. మేడ్చల్ మండలంలో ఐదు చోట్ల అసైన్డ్ భూముల్లో ఇటుక బట్టీలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు కేవలం నోటీసు ఇచ్చి వదిలేశారు. తదుపరి చర్యలు తీసుకోవడం లేదు. 

మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ 

జిల్లాలో రెండు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలు ఉన్నాయి. అయినప్పటికీ గంజాయి మత్తు పదార్థాల విక్రయా లు జోరుగా సాగుతున్నాయి. వీటిని అరికట్టడంలో ఎక్సైజ్ అధికారులు విఫలమయ్యా రు. కల్లు దుకాణాలు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తు న్నారు. జిల్లాలో ఇంజనీరింగ్, ఇతర కళాశాలలు, హాస్టల్స్ అధిక సంఖ్యలో ఉన్నా యి. వీటివద్ద గంజాయి,పదార్థాలు విక్రయిస్తూ విద్యార్థులను బానిసలుగా  చేస్తున్నారు.  ఇవే కాకుండా పౌర సరఫరాలు, విద్యా, వైద్య, ఎస్సీ బీసీ తదితర శాఖల మీద కూడా కలెక్టర్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.