02-06-2025 01:09:20 AM
కామారెడ్డి/జుక్కల్, జూన్ 1 (విజయక్రాంతి) : గత ప్రభుత్వ హాయాంలో గ్రామాల్లో లక్షల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులు అప్పటి సర్పంచులు చేశారు. గ్రామాల లో అభివృద్ధి పనులు చేసి ప్రజల చేత శభాష్ అనిపించుకున్న సర్పంచులకు అప్పులు చేసి పనులు చేసిన వారు ఆర్థిక ఇబ్బందుల్లో గత ప్రభుత్వం అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వమైన ఆదుకుంటుందని తాజా మాజీ సర్పంచులు.
కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 16 నెలలు గడిచిపోవడంతో గత ప్రభుత్వాల్లో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆందోళన చెందు తున్న మరికొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కూలి నాలి పనులు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మాత్రం రావడం లేదు. గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులు చేసిన తాజా మాజీ సర్పంచులు అప్పులు చెల్లించలేక అప్పుడు ఇచ్చిన వారికి ఏమి చెప్పలేక ముఖం చాటేసి పట్టణ ప్రాంతాల్లో కూలి నాలి పని చేస్తే కుటుంబాన్ని ప్రభుత్వం తమ బాధలను గుర్తించి పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేసి గత ప్రభుత్వం చేసిన తప్పిదానికి తాము బలి అవుతున్నామని తాజా మాజీ సర్పంచులు విజయ క్రాంతి ప్రతినిధితో వాపో కామారెడ్డి జిల్లా వెనుకబడిన జుక్కల్ మండలంలోని మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నట్లు వారు చెబుతున్నారు.
సర్పంచుల పదవీకాలం ముగిసి సుమారు రెండు సంవత్స రాలు కావస్తున్న ఇప్పటివరకు పెండింగ్ బిల్లులు రాకపోవడం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై రాష్ట్రంలోని పలు మండలాల్లో అనేకమార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీరుస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు తాజా మాజీ సర్పంచుల బిల్లులు మాత్రం ప్రభుత్వం చెల్లించలేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తాజా మాజీ సర్పంచ్ లకు బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో తాజా మాజీ సర్పంచులు అప్పులు తీర్చలేక తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని సర్పంచ్లు విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం అప్పులు చేసిన వాటికి వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని పేర్కొంటున్నారు. లక్షలు అప్పు ఉండడంతో దిక్కుతో చని పరిస్థితి నెలకొందని అప్పుల బాధ తట్టుకోలేక కొందరు సర్పంచులు ముఖం చాటేసుకుంటున్నామని చెబుతున్నారు. పదవి కాలం ఉన్నన్ని రోజులు అడ్వా న్సు పనులు చేయడంతో బిల్లులు వస్తాయని ఆశతో అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో చేసిన పనులకు కూడా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాసేవ చేయాలనే దృఢ సంకల్పంతో సర్పంచులుగా గెలిచి పనులు చేయడం తాము చేసిన పెద్ద తప్పిదమని వాపోతున్నారు. ఈ విధంగా బిల్లులు రావని తెలిస్తే మునుముందు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్లుగా నిలబడే వారు ముందుకు రాని పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా సర్పంచుల ఎన్నికలు జరిగితే ప్రభుత్వానికి పెద్ద ఎఫెక్ట్ పడవచ్చని అభిప్రాయపడుతున్నారు.
కొంద రు సర్పంచులు ముఖ్యంగా దళిత సర్పంచులు పట్టణాలకు వలస కూలీలుగా, వాచ్మెన్లుగా, సెక్యూరిటీ గార్డులుగా పనులు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని జుక్కల్ మండలంలో ఇప్పటికే కొందరు ఎస్సి సర్పంచులు గ్రామం వదిలి పట్టణాలకు వెళ్లి కుటుంబ సభ్యులుగా తో కలిసి కూలి పనులు చేసుకుంటున్నారు.
గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులకు రిజర్వేషన్ 10 సంవత్సరాల పాటు కల్పించడంతో వారు ఇంకోసారి కూడా తామే సర్పంచ్ గెలవాలని ఉద్దేశంతో ఉన్న డబ్బులతో కాకుండా అప్పులు తెచ్చి మరి పనులు చేసి ఇబ్బందులపాలయ్యామని వాపోతున్నారు. కామారెడ్డి జిల్లా లో 533 గ్రామాలు ఉండగా జుక్కల్ మండలంలో మొత్తం 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో నలుగురు కంటే ఎక్కువగా డబ్బు కలిగిన వారు లేరు.
మిగతా సగం మంది మధ్యతరగతి (బీసీలు) నలుగురు ఎస్సీ, మరో నలుగు ఎస్టి సర్పంచులు ఏమి తోచక ఊరి బయట తిరుగుతూ అప్పు లు ఇచ్చిన వారి నుంచి వస్తున్న బాధను తాళ లేక తప్పించుక తిరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందని వారు ప్రాధేయ పడుతున్నారు.
జిల్లాలో 200 మంది పైగా తాజా మాజీ సర్పంచ్ లు అప్పులు కట్టలేక బిల్లులు రాక అవస్థలు పడుతున్నారు. జిల్లా పరిస్థితి కాకుండా రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో తాజా మాజీ సర్పంచ్ లు పేరు కోసం వివిధ అభివృద్ధి పనులు చేసి అప్పులు పాలై అవస్థలు పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క ఇప్పటికైనా స్పందించి తాజా మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని వారు కోరుతున్నారు.
8 లక్షలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి
8 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి సర్పంచ్ల బాధలు అర్థం చేసుకొని వెంటనే పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పుల వాళ్ళు ఇంటి చుట్టు తిరుగుతున్నారు. బిల్లులు వస్తే సర్పంచులు బాధలు తీర్చినట్లు అవుతుంది. లేకుంటే వచ్చే ఎన్నికల్లో సర్పంచులు నారాజ్ అవుతారు.
అస్పత్వార్ వినోద్, పెద్ద ఏడికి సర్పంచ్
రెండేళ్ల క్రితం బిల్లులు వచ్చాయి.
2023లో అప్పట్లో చేసిన పనులకు బిల్లులు వచ్చాయి. అప్పటినుంచి ఇప్పటివరకు బిల్లులు అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. మొత్తం జిపి పరిధిలో 18 లక్షల వరకు బిల్లులు రావాల్సింది. బిల్లుల రాక కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి సర్పంచిలో పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి.
వజ్రఖండి మాజీ సర్పంచ్ సంజీవ్ పటేల్
పెండిండ్ బిల్లులు విడుదల చేసినప్పుడే నిధులు
రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు వస్తాయి. సర్పంచ్ల అకౌంట్లోనే నేరుగా డబ్బులు అవుతాయి. మిగతా విషయాలు తమకు తెలియదు. చెక్కులు ఎప్పుడు వస్తే అప్పుడు ఇస్తున్నాం. మిగతావి బిల్లులు ఎస్ టి ఓ ద్వారా వారి అకౌంట్లో పడతాయి.
జుక్కల్ ఎంపీడీవో, శ్రీనివాస్