02-06-2025 01:10:38 AM
కామారెడ్డి, జూన్ 1 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం గాయత్రి షుగర్ సమీపంలో ఆదివారం రాత్రి కామారెడ్డి నుంచి స్వగ్రామానికి వెళ్తున్న బైకుపై వెళ్తుండగా అదుపుతప్పి బైకు రోడ్డు పక్కన ఉన్న సైడ్ రైలింగ్ కు తగలడంతో బోల్తా పడి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సదాశివ నగర్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం బొంపల్లి గ్రామానికి చెందిన కరడు పల్లి కార్తీక్ రావు (25) అనే యువకుడు బ్పై స్వగ్రామానికి వెళ్తుండగా అదుపుతప్పి బైక్ బోల్తాపడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు ఎస్త్స్ర రంజిత్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు