15 March, 2026 | 8:08 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా

07-10-2025 12:20 AM

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్ టౌన్, అక్టోబర్ 6: వసతి గృహాల్లో విద్యార్థుల నాణ్యమైన భోజనాన్ని అందించడంలో డైలీ కార్మికులుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం పర్మినెంట్ చేసేలా ఒత్తిడి తీసుకువస్తామని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం వసతి గృహాల్లో పనిచేస్తున్న డైలీ వర్కర్స్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తమరి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యే రీతిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ డైలీవైజ్ వర్కర్స్ సంఘం సభ్యులు చిట్టెమ్మ, సురేష్, జ్యోతి, ఎల్లప్ప, అనసూయ, అరుణ, అంజిలమ్మ, పద్మమ్మ, మూలాల జి, అనిత, రజిత తదితరులు పాల్గొన్నారు.