8 April, 2026 | 4:19 PM

Breaking News

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే బయటకు రండి, కేంద్రం అత్యవసర సూచనలు!   •  

లక్ష్మాపూర్ రెవెన్యూ సమస్యను పరిష్కరించాలి

07-10-2025 12:19 AM

ఏఐసీసీ ఇన్‌చార్జ్‌కు వినతి పత్రం  

శామీర్ పేట్, అక్టోబర్ 6: ఎన్నో ఏండ్లు గా రెవెన్యూ సమస్యతో ఇబ్బంది పడుతున్న లక్ష్మాపూర్ గ్రామం ప్రజల సమస్యను పరిష్కరించాలని క్యాతం మధు కృష్ణ సోమ వారం ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ను  కలిసి వినతిపత్రం అందజేశారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లోని లక్ష్మాపూర్ గ్రామం ప్రజలు ఎన్నో ఏళ్ల నుండి రెవెన్యూ సమస్యతో బాధపడుతున్నారని ఎమ్మెల్యేలకు ,

మంత్రులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేసిన వారి సమస్య ఎక్కడ వేసిన గొంగడిలాగే ఉందని ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అలాగే నూతనంగా ఏర్పడిన మూ డు చింతలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి సరైన నిధులు కేటాయించటానికి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మీనాక్షి నటరాజన్  ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అలాగే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.