9 April, 2026 | 8:50 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

రెండో విడత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

12-12-2025 10:43 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్,(విజయక్రాంతి): రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మరోసారి పిఓ లకు తమ ఎన్నికల విధులపై కీలక సమాచారం అందించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రానికి సమయానికి చేరుకోవడంతో మొదలుకొని, ఎన్నికల సామాగ్రి స్వీకరణ, పోలింగ్ కేంద్రాలకు చేరుకొనుట, పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక, తదితర అంశాలపై అధికారులతో మాట్లాడారు.

వారికి కీలక సూచనలు చేశారు. మొదటి విడత ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, అధికారులందరూ అదే స్ఫూర్తితో పనిచేసి రెండో విడత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు.  నిర్మల్ (గ్రామీణం), సారంగాపూర్, సోన్, దిలావర్పూర్, నర్సాపూర్ (జి), కుంటాల, లోకేశ్వరం ఆరు మండలాల్లో రెండో దశ ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం చేసినట్లు చెప్పారు. ఆన్ లైన్ విధానంలో మండలాల నుంచి ఈ సమావేశంలో పాల్గొన్న తహసిల్దార్లు, ఎంపీడీవోలు, జోనల్ ఆఫీసర్ల ను మండలాల వారిగా ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, డీఈవో భోజన్న, జడ్పి సిఈఓ శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.