9 April, 2026 | 10:48 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఆరు గ్యారెంటీలు అమలు చేయని సీఎంపై మాజీ మంత్రి వినూత్న నిరసన

12-12-2025 10:49 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆరు గ్యారెంటీల అమలుకై మొద్దు నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేల్కొనేలా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం చేపట్టారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బాగంగా శుక్రవారం జైనథ్ మండలంలో ప్రచారం చేపట్టారు. ముందుగా లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మొద్దు నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి నీ నిద్రలో నుండి మోల్కొనేల మాజీ మంత్రి స్వయంగా డప్పు కొడుతూ డప్పు చాటింపు వేస్తూ ఆరు పథకాలపై దండోరా వేస్తూ ప్రచారంలో నిలదీశారు. ఈ సందర్భంగా జోగు రామన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలను మోసగించేలా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. పంచాయితీ తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ కు  ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, బిఆర్‌ఎస్ కు పలుచోట్ల పట్టాం కట్టారని గుర్తు చేశారు.

 పట్టాం కట్టారని గుర్తు. రెండవ, మూడో విడుదల సైతం బి ఆర్ ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.  ఇంజనీరింగ్ కాలేజ్, బిఎస్సి అగ్రికల్చర్ కాలేజ్, రైతు సమస్యలపై ఆదిలాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తో   ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తావించకపోవడం  జిల్లా అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.