31-05-2025 12:24:06 AM
మణికొండ మే 30 : మణికొండ పైపు లై న్ రోడ్డు నుండి అంజలి గార్డెన్ మీదుగా ల్యాంకో హిల్స్ కు వెళ్ళే రోడ్డు.. టీం 4 వారి డ్రైనేజ్ కారణంగా గత కొన్ని నెలలుగా బీట లు వారుతోంది.
దీనికి చిన్నపాటి మరమ్మత్తులు చేస్తూ మన్సిపల్ అధికారులు చేతులు దులుపుకున్నారు గానీ శాశ్వత పరిష్కారం చేయడం లేదు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిం ది స్థానిక మహిళ సుమనళిని. ఈ డ్రైనేజ్ లీకేజ్ విషయంలో ఎన్నోసార్లు అధికారుల కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని గు ర్తుచేసింది. తాము మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనకముందే అధికారులు డ్రైనేజీ మ రమత్తులతో పాటు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆమె డిమాండ్ చేసింది. రోడ్డు బైఠా యించిన సుమనళినికి స్థానిక ప్రజలు తమ మద్ధతు తెలిపారు.