15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి

05-12-2025 07:01 PM

నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని అన్ని పంచాయతీల్లో గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలని నియోజకవర్గం ఇంచార్జ్ వనమా వెంకటేశ్వరరావు కోరారు. శుక్రవారం ఎన్నికల బరిలో ఉన్న టిఆర్ఎస్ అభ్యర్థులు తన నివాసంలో కలిసి ఆశ్చర్వాదం పొందారు.

ఈ సందర్భంగా ఆయన వారిను ఉద్దేశించి మాట్లాడుతూ... బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, గత రెండేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు గెల పొందుతే రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసే గెలుపు లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల పట్టణ ముఖ్య నాయకులు పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు.