15-12-2025 07:27:10 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రజల మద్దతుతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయాలని మాజీ డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు సోమవారం శ్రీహరి రావును కలిసి అభినందించారు. కొత్త సర్పంచ్ లకు సిఆర్ రావు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.