16 April, 2026 | 11:54 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

యశోద హాస్పిటల్స్ సరికొత్త చరిత్ర

19-11-2025 12:00 AM

12 ఏళ్ల బాలుడికి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి

హైదరాబాద్, నవంబర్ 18(విజయక్రాంతి): ప్రపంచ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చరిత్ర లో యశోద హాస్పిటల్స్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రమాదవశాత్తూ పారాక్వాట్ పాయిజన్ (విషపూరితమైన కలుపు మందు) తాగిన అతి పిన్న వయస్కుడికి ప్రపంచంలోనే మొదటిసారిగా విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసి సరికొత్త చరిత్ర నృష్టించింది. పెద్దపల్లిజిల్లా ఓదెల గ్రామానికి చెందిన రైతు సతీష్‌కుమార్, సుమలతల కుమారుడు ఆరవ తరగతి చదువుతు న్న 12 ఏళ్ల అనురాగ్ సందీప్ ప్రమాదవశా త్తూ పారాక్వాట్ పాయిజన్ తాగి ప్రాణాపా యస్థితికి గురయ్యాడు.

ప్రపంచంలోనే తొలిసారిగా పారాక్వాట్ విషాన్ని ప్రమాదవశాత్తు సేవించిన అతి పిన్న వయస్కుడికి యశోద హాస్పిటల్స్ ద్విపార్శ్వ లోబార్ ఊపిరితిత్తుల మార్పిడిని విజయవంతంగా నిర్వ హించింది. యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకాంతి మాట్లాడుతూ, ‘అనురాగ్ సందీప్ మెరుగైన చికిత్స కోసం ప్రాణాంతక స్థితిలో యశోద హాస్పిటల్-సోమాజిగూడకు వచ్చాడు‘ అని అన్నారు.

యశోద హాస్పిటల్స్ పల్మనరీ స్పెషలిస్ట్ల బృందం - డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్, డాక్టర్ చేతన్ రావు, డాక్టర్ పంక్తి సేథ్, డాక్టర్ రమ్య రెడ్డి మరియు ఊపిరితిత్తుల మార్పిడి సర్జన్లు డాక్టర్ కెఆర్ బాలసుబ్రమణియన్, డాక్టర్ మంజునాథ్ బేల్ - యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీలో ద్వైపాక్షిక లోబార్ ఊపిరితిత్తుల మార్పిడిని నిర్వహించారు. 2 వారాల పాటు ఈసీఎంఓ మద్దతు పొందిన తర్వాత, ఎటువంటి మెరుగుదల లేకపోవడంతో, రోగికి ఊపిరితిత్తుల మార్పిడిని పరిగణించినట్లు డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్ తెలిపారు.