2 July, 2026 | 10:56 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

జాగృతి ఆధ్వర్యంలో ‘యువకవుల సమ్మేళనం’

16-05-2025 12:09 AM

-పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రకటించింది. తెలంగాణ సారస్వత పరిషత్‌లో జరుగనున్న ఈ కవి సమ్మేళన కార్యక్రమ పోస్టర్‌ను గురువారం తెలంగాణజాగృతి అధ్యక్షురాలు, ఎమ్మె ల్సీ కవిత హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ జీవనశైలి, విశిష్టతను చాటిచెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహ, చైతన్యా న్ని పెంపొందించడానికి యువ కవుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కవి సమ్మేళనంలో పాల్గొనదలచిన కవులు, కవయిత్రు లు 35ఏళ్లలోపు ఉండాలని, తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో కవితలు వినిపించవచ్చని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈనెల 26లోపు kavitha.telangana@gmail.comకు మెయిల్ చేయాలన్నారు. కార్యక్రమంలో కవుతు కాంచనపల్లి, వనపట్ల సుబ్బయ్య, జాగృతీ నాయకులు నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.