10 May, 2026 | 10:18 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

నిర్మల్ జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో రోశయ్య జయంతి వేడుకలు

04-07-2025 10:44 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసు యంత్రాంగం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల రోశయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల మాట్లాడుతూ... రోశయ్య సుదీర్ఘ కాలంగా ప్రజాసేవలో నిమగ్నమై, చేసిన దేశసేవ, పరిపాలన పటిమ, నిష్కళంక రాజకీయ జీవితాన్ని స్మరించుకున్నారు. రాజకీయాల్లో ఉన్నతమైన నైతిక విలువలకు నిలయంగా నిలిచారని, ఆయన సేవా తత్వం, ప్రజలపట్లకలిగిన కట్టుబాటు ప్రతి అధికారికి ప్రేరణగా నిలవాలని ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.