10 May, 2026 | 12:09 PM

Breaking News

తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •   ఖమ్మంలో ఫుడ్‌ పాయిజనింగ్‌ కలకలం   •  

మా పాఠశాలకు కనీస వసతులు కల్పించాలి

04-07-2025 10:06 PM

దోసపహాడు విద్యార్ధులు ఎంపీడీవోకు మొర

పెన్ పహాడ్: మా పాఠశాలలో కనీస వసతులైన మరుగుదొడ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని వెంటనే మా పాఠశాలకు కావాల్సిన కనీస వసతులు కల్పించి ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం ఎంపీడీవో వెంకటేశ్వరరావుకు మండలంలోని దోసపహాడ్ విద్యార్థులు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాల ఉపాధ్యాయుడు మామిడి వెంకటయ్యతో కలిసి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారికి కలసి పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలపై ఎంపీడీవో వెంకటేశ్వరరావుకు విన్నవించుకున్నారు. స్పందించిన ఎంపీడీవో పాఠశాలకు కావలసిన కనీస వసతులు ఏర్పాటుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరిత గతిన కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.