10 May, 2026 | 2:47 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

బిఎల్ఓలు విధుల నిర్వహణలో నిష్పక్షపాతంగా ఉండాలి

04-07-2025 10:11 PM

తహసీల్దార్ లాలునాయక్ 

పెన్ పహాడ్: బూత్ లెవెల్ అధికారులు తమ విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా ఉండాలని తహసిల్దార్ లాలూ నాయక్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో మండలంలోని ఆయా గ్రామాల బూత్ లెవెల్ అధికారులు (బిఎల్ఓ) ఎన్నికల నిర్వహణలో భాగంగా నూతన ఓటర్ల నమోదు, అనరుల తొలగింపు, బూతు లెవల్లో ఓటర్ల సవరణ, మార్పు చేయడంపై అవగాహన కల్పించి మాట్లాడారు. ఫామ్ - 6, 7, 8 ఆధారంగా బిఎల్ఓ లు నిష్పక్షపాతంగా వివరాలు నమోదు చేసి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఓటర్ నమోదులో వ్యక్తిగత అంశాలు దృష్టిలో పెట్టుకొని పౌరుల ఓటు హక్కును తొలగించడం.. ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు చేసినట్లు ఫిర్యాధులు అందితే సదరు బిఎల్వో లపై చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యపేట తాసిల్దార్ కృష్ణయ్య, సీనియర్ అసిస్టెంట్ రాధ,  ఎం పి ఎస్ ఓ నవీన్, ఎలక్షన్ ఇంచార్జ్ శ్రీనిధి తదితరులు ఉన్నారు.