6 June, 2026 | 11:51 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

బైక్ అదుపుతప్పి బావిలో పడి యువకుడు మృతి

25-10-2025 08:26 PM

ఆందోళ‌న చేసిన మృతిని కుటుంబీకులు

నారాయణఖేడ్: బైక్ పై వెళ్తున్న క్రమంలో రోడ్డుపై గుంతల కారణంగా రోడ్డు పక్కన ఉన్న బావిలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మనూరు మండలం మైకోడు గ్రామానికి చెందిన దత్తు(40) మైకోడు గ్రామం నుండి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో ఊరు శివారులో ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన గల బావిలో పడిపోవడం జరిగింది. కాసేపటికి చుట్టుపక్కల వారు అనుమానంతో పరిశీలించగా రోడ్డు పక్కన బైకు, చెప్పులు పడి ఉండడంతో ఎవరో బావిలో పడ్డారని స్థానికులు పేర్కొన్నారు. దీంతో మైకుడు గ్రామానికి చెందిన దత్తు అనే యువకుని బైక్ ఉండడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

అనుమానంతో బావిలో వెతుకడంతో అప్పటికే బావిలో పడి మృతి చెందిన దత్తు మృతదేహం లభ్యమైంది. దీంతో బావి నుండి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు పక్కన బావి ఉండడంతో పాటు రోడ్డు మార్గం సక్రమంగా లేని కారణంగానే తమ కుమారుడు మరణించడం జ‌రిగింద‌ని తల్లిదండ్రులు, బంధువులు, స్థానిక గ్రామస్తులు రోడ్డుపై కాసేపు ఆందోళన చేపట్టారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్థానిక నాయకులు స్పందించి గోతులమైన రోడ్డును బాగు చేయించాలని వారు డిమాండ్ చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు  ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.