24-06-2025 07:34:23 PM
సీఐ రమణమూర్తి..
లక్షేట్టిపేట (విజయక్రాంతి): యువత గంజాయి, డ్రగ్స్ కి దూరంగా ఉండాలని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి(CI Ramana Murthy) అన్నారు. మంగళవారం పట్టణంలోని బస్ స్టాండ్, ఉత్కూర్ చౌరస్తాతో పాటు రద్దీ ప్రాంతాల్లో లక్షెట్టిపేట పోలీస్ల ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్ (గంజాయి, డ్రగ్స్ గుర్తించే ప్రత్యేక శునకం)తో లక్షెట్టిపేట సిఐ, పోలీస్ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రమణ మూర్తి మాట్లాడుతూ... గంజాయి సేవించిన, విక్రయించిన అది చాలా పెద్ద నెరమన్నారు. గాంజయి రహిత రాష్ట్రంగా తెలంగాణను ఉంచేందుకు పోలీస్ శాఖ, ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
నేటి నుండి రాత్రి పగలు ప్రత్యేకంగా అనుమానం ఉన్న ప్రాంతాల్లో సోదాలు చేయడం జరుగుతుందన్నారు. గాంజా కేసులో ఒక్కసారి ఇరుక్కుంటే జీవితంలో ముందుకు సాగలేమని ప్రతి ఒక్కరు ఇట్టి విషయాన్ని గమనించి గంజాయి సేవించేవాళ్లు ఉన్నట్లు తెలిసిన, గాంజా సరఫరా చేసే వారి వివరాలు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై గోపతి సురేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.