రైతులను దోపిడీ చేస్తే సహించం
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 13 (విజయక్రాంతి): తాలు,తడక పేరుతో రైతులను దోపిడికి గురి చేస్తే ఎంత మాత్రం సహించేది లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రైస్ మిల్లర్లను హెచ్చరించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ధాన్యం, మక్కల కొనుగోళ్లపై రెవెన్యూ, సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, గ్రామీణ అభివృద్ధి, సహకార, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో పాటు రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు.
14-05-2026