మహేష్ కుమార్ పర్యటన విజయవంతం చేయాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాపర్యటన నేపథ్యంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ గురువారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ మాట్లాడారు. ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు ఆసిఫాబాద్లోని రోజ్ గార్డెన్లో జిల్లా స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులు, ఎఫైర్స్ కమిటీ సభ్యులు, అలాగే పార్టీ అనుబంధ సంఘాలైన యూత్ కాంగ్రెస్, మహిళ కాంగ్రెస్, NSUI, సేవాదళ్, కిసాన్ కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు, సభ్యులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు,ముఖ్య కార్యకర్తలు తప్పనిసరిగా హాజరుకావాలని సుగుణక్క పిలుపునిచ్చారు.పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేయడం లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
02-04-2026