calender_icon.png 11 February, 2026 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కు వినియోగించిన షబ్బీర్ అలీ

11-02-2026 12:48:49 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలో మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో బూత్ నెంబర్ 151లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు  షబ్బీర్ అలీ  ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేయాలని, ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు.