27 July, 2026 | 6:58 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

స్వగ్రామానికి హిడ్మా మృతదేహం.. విలపిస్తున్న తల్లి, ఆదివాసీలు

20-11-2025 11:25 AM

విజయవాడ: మావోయిస్టు అగ్రనేత హిడ్మా(Madvi Hidma) మృతదేహం ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. రంపచోడవరం(Rampachodavaram) ఆస్పత్రిలో బుధవారం రాత్రి హిడ్మా మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. హిడ్మా, అతని భార్య రాజే మృతదేహాలను అధికారులు బంధువులకు అప్పగించారు. అర్ధరాత్రి 12 గంటలకు బందోబస్తు మధ్య హిడ్మా మృతదేహం ఛత్తీస్‌గఢ్‌కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. హిడ్మా మృతితో ఛత్తీస్‌గఢ్‌ లోని సుక్మాజిల్లా పువ్వుర్తి(Sukma district Puvarti village) గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. హిడ్మా మృతదేహం చూసి హిడ్మా తల్లి పుంజి, ఆదివాసీలు బోరున విలపిస్తున్నారు. 

మొన్న జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, రంపచోడవరం ఆస్పత్రిలో(Rampachodavaram Hospital) మావోయిస్టుల మృతదేహాలకు(Maoists Bodies) పోస్టుమార్టం చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మావోయిస్టుల మృతదేహాలను వైద్యులు బంధువులకు అప్పగిస్తున్నారు. ఏపీలోని రంపచోడవరం ఆస్పత్రి వద్ద మృతుల బంధువులు వేచిఉన్నారు. అల్లూరి జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మరణించారు. రంపచోడవరం ఆస్పత్రిలో 11 మంది మావోయిస్టుల మృతదేహాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.