n లిక్కర్ కేసులో కీలక పరిణామం
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి) : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టులో సెక్షన్ 164 కింద శరత్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన వాంగ్మూలాన్ని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా రికార్డు చేశారు. తెలంగాణలో భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారంలో శరత్ చంద్రారెడ్డిని ఎమ్మెల్సీ కవిత బెదిరించారని సీబీఐ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే.