calender_icon.png 16 December, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకం.. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం

15-12-2025 01:29:07 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

అశ్వరావుపేట డిసెంబర్ 14, (విజయక్రాంతి):తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం లభించే వాటి పైన దృష్టి సా రించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన లక్కీ పౌల్ట్రీ ఫార్మ్ ను ఆదివారం ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా రైతు నాయుడు ప్రసాద్ దంపతులు నిర్వహిస్తున్న కౌజు పిట్ట లు, నాటు కోళ్ల పెంపకం యూనిట్లుతో పాటు ఇంక్యులేటర్ (గుడ్ల నుంచి పిల్లల ఉత్పత్తి) వ్యవస్థను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు.ఫార్మ్ లో కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకానికి అనుసరిస్తున్న ఆధునిక పద్ధతులు, మేత తయారీ, ఆరోగ్య సంరక్షణ, శుభ్రత ప్రమాణాలు, ఉత్పత్తి సామర్థ్యం, మార్కెటిం గ్ విధానాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ము ఖ్యంగా ఇంక్యులేటర్ ద్వారా గుడ్ల నుంచి పిల్లల ఉత్పత్తి ప్రక్రి య, ఉష్ణోగ్రత నియంత్రణ, తేమ స్థాయి, హ్యాచింగ్ శాతం తదితర అంశాలపై నిర్వాహకులతో చర్చించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు కలెక్టర్ కు వివరిస్తూ, ఈ పౌల్ట్రీ ఫార్మ్ ద్వారా సుమారు 30 వేల కౌజు పిట్టల గుడ్లు, అలాగే వెయ్యి నాటు కోడి గుడ్ల ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు.

ఇంక్యులేటర్ స హాయంతో గుడ్ల నుంచి ఆరోగ్యకరమైన పిల్లలను ఉత్పత్తి చేసి, మహిళా స్వయం సహాయక సంఘాలకు, చిన్న రైతులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పె ట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే రంగంగా కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకం నిలుస్తుందని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ యూనిట్ ను మరింత విస్తరించి ఇంక్యులేటర్ సామర్థ్యాన్ని పెంచాలని, తద్వారా ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని సూచించారు.

విద్యుత్ ఖర్చును తగ్గించేందుకు సోలార్ విద్యుత్ వినియోగం దిశగా చర్యలు తీసుకోవాలని, పౌల్ట్రీ రంగంలో ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ సూచించారు. ఇలాంటి నమూనా పౌల్ట్రీ యూనిట్లు జిల్లాలో మరిన్ని ఏర్పాటయ్యేలా రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.