17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

21-10-2025 06:16 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు తమ సొంతం అవుతుందని కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్ ప్రిన్సిపాల్ పి. అరుణ్ జ్యోతి రెడ్డి అన్నారు. తెలంగాణ యూత్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రీడోత్సవాలు పోచారం మున్సిపల్ ఇస్మాయిల్ ఖాన్ గూడలోని ఎస్టి. పీటర్ శాంతినికేతన్ హైస్కూల్లో నిర్వహించారు. ఈ క్రీడల్లో మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు స్కూల్స్ సుమారు 900 వందలపై చిలుకు విద్యార్థులు పాల్గొనగా అందులో కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్ చెంగిచెర్ల బ్రాంచ్ కి చెందిన విద్యార్థులు అండర్ 14  కబడ్డీ, ఖోఖో క్రీడలలో బాలురు విజయం సాధించగా అండర్ 14  ఖోఖో లో బాలికలు రెండవ స్థానాన్ని గెలుచుకున్నారు. ఇందులో గెలిచిన విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎంపిక కావడం వల్ల ఆయొక్క స్కూల్  ప్రిన్సిపాల్  పి. అరణ్ జ్యోతి రెడ్డి, డైరెక్టర్ జి. శశికాంత్ రెడ్డి, విద్యార్థులకు, విద్యార్థినులకు శిక్షణ ఇచ్చిన పిఈటి జి. నరేష్ ను అభినందించి విద్యార్థుల పట్ల  హర్షం వ్యక్తం చేశారు.