13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పగిలిన పైప్ లైన్.. ఎగిసి పడిన నీరు

03-01-2026 12:00 AM

మానకొండూరు, జనవరి 2(విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్య పల్లి శివారులో హైదరాబాద్ మెట్రో వాటర్ వరక్స్( హెచ్‌ఎం డబ్ల్యూఎస్) ప్రధాన పైప్ లైన్ కు గండిపడి నీరు ఎగిసి పడింది.. రామగుండం నుండి హైదరాబాద్ కు మంచినీటిని తరలించే  ఈ మెయిన్ లైన్ మానేరు వాగు సమీపంలో పగిలిపోయింది. ఒత్తిడితో నీరు బయటకు రావడంతో సమీపంలోని విద్యుత్ వైర్లు ఉండడంతో ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు సరఫరా నిలిపివేశారు. సమాచారం అందుకున్న అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. సంఘటన స్థలానికి చేరుకొని సిబ్బంది పైపులైనుకు మరమ్మతులు చేపట్టారు.