14 August, 2026 | 10:06 PM

Breaking News

చిట్యాలలో టీటీడీ కల్యాణ మండపం భూమిపై సమగ్ర విచారణ జరిపించాలి   •   విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు ఘన నివాళి   •   విద్యార్థులు కళావేదికను సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలి   •   విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి   •   బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్   •   ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు   •   పశువుల దొంగలు అరెస్టు   •   శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •   మోస్రా వెళ్లే ప్రయాణికులకు తప్పని తిప్పలు   •   సీఎస్ సంజయ్ జాజు పలు అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్   •  

టైటాన్స్‌కు హ్యాట్రిక్ ఓటమి

27-10-2024 12:00 AM

పీకేఎల్ 11వ సీజన్

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ హ్యాట్రిక ఓటమి మూటగట్టుకుంది. శనివారం గచ్చిబౌలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 37-41తో దబంగ్ ఢిల్లీ చేతిలో పరాజయం చవిచూసింది. తొలి హాఫ్‌లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన టైటాన్స్ రెండో సగం లో అదే జోరు చూపించలేకపోయింది.

తె లుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ 18 పా యింట్లతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రైడ ర్ అనీశ్ నర్వాల్ 9 పా యింట్లు సాధించాడు. దబంగ్ ఢిల్లీ తరఫున కెప్టెన్ నవీన్ కుమార్, డిఫెండర్ ఆశు మాలిక్ చెరో 15 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పో షించారు. అంతకముందు యు ముంబా, బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ 31-31తో టై అయింది.

ఈ సీజన్‌లో ఒక మ్యాచ్ టై కావడం ఇదే తొలిసారి. యు ముంబా తరఫున రైడర్ మన్‌జీత్ 7 పాయింట్లు సాధించగా.. డిఫెండర్ సోంబిర్ 5 పాయింట్లు స్కోరు చేశాడు. ఇక బెంగాల్ వారియర్స్ నుంచి రైడర్ మనిందర్ సింగ్ 8 పాయింట్లు స్కోరు చేశాడు.