13-11-2025 09:26:37 PM
ముఖ్యఅతిథిగా మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి..
మేడిపల్లి (విజయక్రాంతి): మేడిపల్లి మండలం పిర్జాదిగూడలో వందేమాతర గీతానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా సెజ్ పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిఐ గోవిందరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ గోవిందరెడ్డి వందేమాతర గీతం చరిత్రను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేజ్ స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సీతమహా లక్ష్మి, ప్రిన్సిపాల్ చైత్ర రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మేడిపల్లి ఎస్సై కృష్ణయ్య, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.