8 April, 2026 | 4:20 PM

Breaking News

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే బయటకు రండి, కేంద్రం అత్యవసర సూచనలు!   •  

ఆర్థిక ఇబ్బందులతో పెయింటర్ ఆత్మహత్య..

23-01-2026 08:25 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): పని దొరకటం లేదని... ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతూ మనస్థాపం చెందిన పెయింటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాప్రాల్ పరిధిలోని వాంబే క్వాటర్స్ లో చోటుచేసుకుంది. అక్షయ్(23) తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. అక్షయ్ పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగించేవాడు.

ఇటీవల పని సరిగ్గా దొరకకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్ళిన తరువాత ఒంటరిగా ఉన్న అక్షయ్ మనస్థాపం చెంది టెర్రస్ పైన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.