13 April, 2026 | 4:07 PM

Breaking News

కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •   దొంగతనం కేసును ఛేదించిన బిక్కనూర్ పోలీస్   •   ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ కు కళాశాలలో ఘనంగా నివాళులు   •  

మహిళల సృజనాత్మకతకు ప్రతిబింబం

12-01-2026 02:35 AM

మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

ఖైరతాబాద్, జనవరి 11 (విజయక్రాంతి) : ముగ్గులు మహిళల సృజనాత్మకతకు ప్రతిబింబం అని ఖైరతాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి అన్నారు. హిమాయత్ నగర్ డివిజనులోని జైస్వాల్ లైనులో ఆదివారం జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీకి ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. బిజెపి నాయకుడు కొయ్యడ నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది ముగ్గుల పోటీని నిర్వహించడం అభినందనీయమన్నారు. తద్వారా మహిళల్లోని ప్రతిభను వెలికి తీసే వీలు కలుగు తుందన్నారు. పోటీల్లో ఉత్సాహంగా పాల్గొ న్న ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సంబరాలను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.  తెలుగు వారికే ప్రత్యేక మైన పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి హిమాయ త్ నగర్ డివిజన్ అధ్యక్షురాలు మాధవి, నాయకుడు పందిళ్ల ప్రసాద్ తదితరులున్నారు.