22 April, 2026 | 7:22 PM

Breaking News

ఐలేని రెడ్డి సంఘం అధ్యక్షునిగా మల్లారెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు   •   గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్   •   వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •  

టిప్పర్, ఆర్టీసీ బస్సు ఢీ

28-12-2025 12:50 AM
  1. 22 మంది ప్రయాణికులకు గాయాలు
  2. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం
  3. సంగారెడ్డి జిల్లా కంది వద్ద ఘటన 

సంగారెడ్డి, డిసెంబర్ 27(విజయక్రాంతి) :ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో సుమారు 22 మంది ప్రయాణికులు గాయాలపాలైన సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు సంగారెడ్డి నుంచి పటాన్‌చెరు వెళ్తూ కంది సమీపానికి రాగానే డ్రైవర్ వేగంగా ఆగివున్న టిప్పర్ లారీని ఢీకొట్టాడు.

ప్రమాదసమయంలో బస్సులో 60 మంది ప్రయాణి కులు ఉన్నారు. ఈ ఘటనలో22 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 అంబులెన్సు ద్వారా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదే బస్సు ఓ స్కూటర్‌ను ఢీకొట్టడంతో గాయాలు కావడంతో అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి నట్లు తెలిసింది. కాగా గాయపడ్డ ప్రయాణికులు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో బాధితు లకు స్కానింగ్ చేయడానికి కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.