16 April, 2026 | 9:40 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

మతసామరస్యాన్ని చాటిన ముస్లిం యువకుడు

17-05-2025 12:00 AM

చేర్యాల, మే 16 : మానవులంతా ఒక్కటే. తోటి మనిషిని  మానవత్వంతో చూడాలే తప్ప కులాన్నో, మతాన్నో చూసి ఆదరించడం మనిషి తత్వం కాదని నిరూపిస్తూ, పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ ముస్లిం యువకుడు. సబ్కా మాలిక్ ఏక్ హై అన్న భావనను పాటిస్తూ, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ ముందుకు సాగుతున్నాడు. అన్వర్ పాషా ది చేర్యాల మండలం వీరన్న పేట గ్రామం.

చిన్నప్పట్నుంచి చుట్టూ హిందువులు స్నేహితులుగా ఉండడంతో తన మత ఆచారాలను పాటిస్తూనే, పరమతాన్ని పట్ల గౌరవించడం అలవాటు చేసుకున్నాడు. అందులో భాగంగానే ప్రతి ఏటా జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్పంచుకుంటూ, హిం దువులతో పాటు 11 రోజులపాటు నియమ నిష్ఠలతో ఉంటాడు.

ఈ సంవత్సరం మరో అడుగు ముందుకేసి మాలాధారణ చేసిన హనుమాన్ భక్తులకు తన సొంత ఖర్చులతో అన్నదానం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వితరణ కార్యక్రమంలో స్వయంగా తానే పాల్గొని వడ్డించడం విశేషం.

ఈ సందర్భంగా అన్వర్ పాషా మాట్లాడుతూ హిందూ ముస్లిం భేదభావం లేకుండా అందరూ సోదర భావంతో మెలగాలని తన పుట్టిన గ్రామం నేర్పిందని తెలిపారు. సబ్కా మాలిక్ ఏక్ హై అన్న భావనతో తను ఈ కార్యక్రమాన్ని చేపట్టానని తెలిపారు. తనకు మతం,కులం ముఖ్యం కాదని మానవత్వమే ముఖ్యమని తెలిపారు.