10 April, 2026 | 3:24 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

అభయ సీనియర్ సిటిజన్ భవనం ప్రారంభం

12-10-2025 03:29 AM

సాయినగర్ కాలనీలో ఏర్పాటు

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): నాగోల్ డివిజన్ పరిధిలోని సాయినగర్ కాలనీ (సౌత్)లో అభయ సీనియర్ సిటిజన్, వెల్ఫేర్ అసోసియేషన్ భవనం శనివారం ఘనంగా ప్రారంభమైం ది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా ఎల్‌బి నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ హాజరై భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. “సమాజంలో సీనియర్ సిటిజన్లు అమూల్యమైన అనుభవ సంపద కలవారు. వారికి సౌకర్యవంతమైన వేదికలు అందించడం మనందరి బాధ్యత” అని పేర్కొన్నారు. 

ఇటువంటి సదుపాయాలు వృద్ధుల సంక్షేమానికి తోడ్పడతా యి అని తెలిపారు. కార్యక్రమంలో సాయి నగర్ సౌత్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బద్దం భాస్కర్‌రెడ్డి, జనరల్ సెక్రెటరీ ఉమేష్‌గౌడ్, వైస్ ప్రెసిడెంట్ రేవంత్ గౌడ్, సుధా కర్, జాయింట్ సెక్రెటరీ పరమేశ్వర్‌రెడ్డి, శివ, కృష్ణారెడ్డి, రాము, భాస్కర్, భారత్, రామ్‌రెడ్డి, వీరచారి, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.