9 April, 2026 | 11:23 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

జూనియర్ కళాశాలలో ఏబీవీపీ నూతన కమిటీ

24-10-2025 06:34 PM

సభ్యత్వం తీసుకున్న విద్యార్థులు

పాపన్నపేట,(విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అనేక రకాల ఉద్యమాలకు నాంది పలికిందని ఏబీవీపీ మెదక్ విభాగ్ సంఘటన మంత్రి బోడ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆయన సమక్షంలో శుక్రవారం పాపన్నపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులుగా పి.సంతోష్, కార్యదర్శిగా వినయ్, ఉపాధ్యక్షులుగా విక్రం, యాది లక్ష్మి, వంశీ, సహాయ కార్యదర్శులుగా బాలరాజ్, శ్రీకాంత్, అశ్విని తదితరులను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయవాదం దేశభక్తి వైపు లక్షలాదిమంది విద్యార్థులను జాతీయవాదులుగా తయారు చేస్తున్న సంస్థ ఏబీవీపీ అని అన్నారు. చదువుతోపాటు నైతిక విలువలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకున్న విద్యార్థుల కోసం పక్క భవనాలు మంజూరు చేయాలని, స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.