28 August, 2026 | 8:10 PM

Breaking News

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ : గుండా నిరంజన్   •   సీఎంకు రాఖీ కట్టిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్   •   విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం   •   ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •  

లైంగికదాడి కేసులో నిందితుడి రిమాండ్

31-10-2025 12:00 AM

ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి

కామారెడ్డి, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): మహిళను అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ కార్యాలయం లో గురువారం ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా కు వివరాలను వెల్లడించారు.  పాల్వంచ మండలం ఫరీద్ పేట గ్రామానికి చెందిన ఓ మహిళ ఈనెల 26న అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. అదే గ్రామ శివారులో ఉన్న రైస్‌మిల్లులో పనిచేసే బీహార్ కార్మికుడు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. అత్యాచారానికి గురైన మహిళను స్థాని కులు గుర్తించి ఆమెను చికిత్స నిమి త్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితున్ని పట్టుకోవడం కో సం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సదరు నిందితుడిని గురువారం మహారాష్ట్రలోని గొండ్యా జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు పనిచేసిన రైస్‌మిల్లు యజమానిపై చర్యలు తీసుకోవాలని ఘటన జరిగిన రోజు బాధితురాలి తరపున పలువురు ధర్నాకు దిగారు.