15 April, 2026 | 12:31 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు

13-01-2026 12:10 AM

సిద్దిపేట క్రైం, జనవరి 12 : మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి హెచ్చరించారు. సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్, రవాణాశాఖ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు నుంచి విక్టరీ చౌరస్తా వరకు రోడ్డు భద్రతపై  నినదిస్తూ ఫ్ల కార్డు ప్రదర్శిస్తూ  ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంకన్ డ్రైవ్ లో మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా,  రెండవసారి పట్టుబడితే జైలు శిక్ష విధిస్తున్నామని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, ఫోర్ వీలర్ వెహికల్స్ నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. పట్టణంలో కూడా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపేవారికి చలానా విధించాలని పోలీస్ శాఖకు సూచించారు. ర్యాలీలో జిల్లా కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.