10-06-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్ జూన్ 9 ( విజయక్రాంతి ): రెడ్ క్రాస్ సొసైటీ వారు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను గ్రామానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి ఆక్రమించుకున్నారని అట్టి వ్యక్తిపై చర్యలు తీసు కొని తమకు ఇల్లు నిర్మించాలని కోరుతూ నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామ ఆదివాసి చెంచులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
2006 సంవత్సరంలో సుమారు 70 మంది దరఖాస్తు చేసుకోగా రెడ్ క్రాస్ సొసైటీ వారు 53 మంది చెంచులకు ఇళ్ల పట్టాలు ఇస్తూ స్లాబ్ వరకు నిర్మాణం కూడా చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం మధ్యలోనే వదిలేయడంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సర్పంచ్ జే రవి పాతబడిన ఇళ్ల గోడలను కూల్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతరం ఖాళీగా ఉన్న స్థలాన్ని బస్టాండ్ నిర్మిస్తామంటూ అక్రమంగా కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూరిగుడిసెలో బ్రతుకుతున్న వారికి అదే స్థలంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు.