3 July, 2026 | 9:07 PM

Breaking News

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •  

కౌమారం.. బాలికల్లో కీలక దశ

17-09-2025 02:07 AM
  1. సామాజిక రుగ్మతలకు చెక్ పెట్టేలా ..గ్రామాల వారీగా కిశోర బాలికల సంఘాల ఏర్పాటు
  2. మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): కౌమారం.. బాలికల్లో అత్యంత కీలకమని, ఇది జీవితాన్ని మలుపుతిప్పే దశ అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. అమ్మాయిల్లో శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా ఈ దశ సంక్లిష్టమైనదన్నారు. ప్రజాభవన్‌లో కౌమా ర బాలికల సాధికారతపై మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్ర మంలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు.

సామాజిక రుగ్మతలకు చెక్ పెట్టేలా గ్రామాల వారీగా కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి  మహిళా స్వయం సహాయక బృందాలతో అనుసంధానం చేయాలని సూచించారు. కౌమార బాలికలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటారని, బాల్య వివాహాలు, చదువును ఆపే యడం, రక్తహీనత, పోషకాహారలోపం, ఆరో గ్య సంబంధిత సమస్యలు, వేధింపులకు గురయ్యే ప్రమాదముంటుందని ఆందోళనవ్యక్తం చేశారు.

ఈ సమస్యలు కౌమార బాలిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు. అందుకే మహిళా స్వయం సహాయక సంఘాల తరహాలోనే కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సంఘాల ఏర్పాటులో డీఆర్‌డీఓలు, డీడబ్ల్యూఓలు కలిసి పని చేయాలన్నారు.

కిషోర బాలిక సంఘాలను బలోపేతం చేస్తే.. వారి సమస్యలన్నీ సమసి పోతాయని తెలిపారు.. సమావేశంలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, అడిషనల్ సీఈఓ కాత్యాయని, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ జి.సృజన, యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్, కౌమార యువజన అభివృద్ధి అధికారి ఎం. మురళీకృష్ణ, తరుణి సంస్థ చైర్ పర్సన్ మమత రఘువీర్ పాల్గొన్నారు.