17-09-2025 03:13:31 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద జనహితసేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం నాగుల నాగేష్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా అతని కుటుంబ సభ్యులు పేదలకు అన్నదానం నిర్వహించారు. దాతల సహకారంతో 360 వ సారి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని జనహిత సేవాసమితి అధ్యక్షులు ఆడెపు సతీష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి సభ్యులు భీమిని కనకయ్య, సకినాల రాజేశ్వరరావు, నిచ్చ కోల గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.