12 May, 2026 | 12:10 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిస్వా శర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

17-09-2025 02:07 AM

ఇల్లంతకుంట, సెప్టెంబర్ 16(విజయక్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యం కోసం వచ్చే రోగులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించద్దని, వార్డులు, సిబ్బంది హాజరు వివరాలు ఫార్మసీ తదితర అంశాలపై ఆరా తీశారు.

వైద్య సేవల తీరుపై ఆసుపత్రికి వచ్చిన రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దలింగాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మధ్యాహ్న భోజన సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌలపై మాత్రమే చేయాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం సిద్ధం చేయాలనిసూచించారు.