3 July, 2026 | 10:08 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

17-09-2025 02:07 AM

ఇల్లంతకుంట, సెప్టెంబర్ 16(విజయక్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యం కోసం వచ్చే రోగులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించద్దని, వార్డులు, సిబ్బంది హాజరు వివరాలు ఫార్మసీ తదితర అంశాలపై ఆరా తీశారు.

వైద్య సేవల తీరుపై ఆసుపత్రికి వచ్చిన రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దలింగాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మధ్యాహ్న భోజన సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌలపై మాత్రమే చేయాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం సిద్ధం చేయాలనిసూచించారు.