15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన అజయ్ గౌడ్

30-10-2025 06:17 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మాజీ సర్పంచ్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు పడాల అజయ్ గురువారం రాష్ట్రమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రాంత అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, స్థానిక అవసరాలపై ఆత్మీయంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరామారావు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి, గెలుపు సాధనకు కృషి చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబుకు పడాల అజయ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ కల్లేపల్లి జానీ, మాజీ సర్పంచ్ సత్యనారాయణ రావు, చక్రధర్, బీసీ సంఘం నాయకులు రాజకుమార్, రమణరావు తదితరులు పాల్గొన్నారు.