24 April, 2026 | 12:21 PM

Breaking News

BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

మాలిలో ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన అల్ ఖైదా

03-07-2025 10:33 AM

న్యూఢిల్లీ: పశ్చిమ ఆఫ్రికా దేశంలోని వివిధ ప్రాంతాలలో వరుస ఉగ్రవాద దాడుల మధ్య మాలిలో(Mali) ముగ్గురు భారతీయ పౌరుల అపహరణపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయులను(Indians Kidnap) అపహరించిన ఒక రోజు తర్వాత వారి విడుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని న్యూఢిల్లీ మాలి ప్రభుత్వాన్ని కోరింది. కేస్‌లోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న భారతీయుల అపహరణపై విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జూలై 1న సాయుధ దుండగుల బృందం ఫ్యాక్టరీ ఆవరణలో సమన్వయంతో దాడి చేసి ముగ్గురు భారతీయులను బలవంతంగా బందీలుగా తీసుకెళ్లినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మాలి అంతటా జరిగిన సమన్వయ దాడులకు అల్-ఖైదా(Al Qaeda) అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (Jama'at Nasr al-Islam wal-Muslimin) బాధ్యత వహించింది. బమాకోలోని భారత రాయబార కార్యాలయం సంబంధిత అధికారులు, స్థానిక చట్ట అమలు సంస్థలు, డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్వహణతో దగ్గరి కమ్యూనికేషన్‌లో ఉందని ఏంఈఏ తెలిపింది. అపహరణకు గురైన భారతీయ పౌరుల కుటుంబ సభ్యులతో కూడా మిషన్ సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది.

"ఈ దారుణమైన హింసాత్మక చర్యను భారత ప్రభుత్వం(Government of India) నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది. అపహరణకు గురైన భారతీయ పౌరులను సురక్షితంగా, త్వరగా విడుదల చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మాలి రిపబ్లిక్ ప్రభుత్వాన్ని కోరుతోంది" అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. భారతీయ పౌరులను సురక్షితంగా విడుదల చేయడానికి వివిధ స్థాయిలలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం మాలిలో నివసిస్తున్న భారతీయులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని క్రమం తప్పకుండా అవసరమైన సహాయం కోసం బమాకోలోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ఏంఈఏ సూచించింది. భారతీయులకు అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని, అపహరణకు గురైన భారతీయులను వీలైనంత త్వరగా సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది.