03-07-2025 05:40:40 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రతి విద్యార్థి చదువుకున్న పాఠశాలలో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అన్నారు. గురువారం లక్ష్మణ్ చందా మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటిన విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, మండల అధికారులు పాల్గొన్నారు.