23 April, 2026 | 5:08 PM

Breaking News

అధికారంలోకి వచ్చాక విస్మరించడం తప్పు... జగ్గారెడ్డి సంచలన పోస్ట్   •   ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్   •   వన్యప్రాణుల క్రమ శిక్షణ   •   ఏటీఎంలో వ్యక్తి మృతదేహం.. మసబ్ ట్యాంక్‌లో కలకలం   •   3 గంటల వరకు తమిళనాడులో 70%, బెంగాల్‌లో 78.77% పోలింగ్‌ నమోదు   •   కాళేశ్వరంపై కాంగ్రెస్, BRS కుమ్మక్కయ్యాయి   •   అకాల వర్షంతో తడిసిన వడ్లు – ప్రభుత్వానికి రైతుల విజ్ఞప్తి   •   ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావం.. హైదరాబాద్‌కు వర్ష సూచన   •   ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి   •   పోలీసుల ఆంక్షల మధ్య రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె   •  

దాన గుణం ఉన్నవారే గొప్పవారు

03-07-2025 05:43 PM

దాతల దాతృత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

ఆకర్షణీయంగా ప్రీ ప్రైమరీ తరగతి గది..

కాంప్లెక్స్ హెచ్ఎం లక్ష్మయ్య..

చిన్నకోడూరు: ధనవంతులు అందరికి దానగుణం ఉండదని.. దాతృత్వ హృదయం ఉన్నవారే గొప్పవారని చిన్నకోడూరు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య(Principal Lakshmaiah) అన్నారు. గురువారం మండలంలోని రామంచ ప్రాథమిక పాఠశాలలో లయన్ ఉజ్వల మోదాని పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులందరికీ 5 వేల విలువగల నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిలను అందించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రీ ప్రైమరీ ప్రత్యేక తరగతి గదిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రామంచ ప్రాథమిక పాఠశాలలో దాతల సహాయంతో లక్షలాది రూపాయల కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు.

దాతలు అందించే చేయూతను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకోవాలన్నారు.  తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చేలా ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రీ ప్రైమరీ తరగతి ఎంతో ఆకర్షినియంగా ఉందన్నారు. విద్యార్థులు కూడా ఆసక్తిగా వివిధ ఆటలాడుతూ సంతృప్తి చెందుతున్నారన్నారు. విద్యార్థులకు  చేయూతను అందించిన ఉజ్వల మోదానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అబ్దుల్లా షరీఫ్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ భారతమ్మ, ప్రేమలత, వివో పద్మ, ఉపాధ్యాయులు వై.వి. సురేష్ కుమార్, వరప్రసాద్,లలిత, సునీత, నాగమణి, వాణి తదితరులు పాల్గొన్నారు.